మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- July 06, 2026
మస్కట్: ఒమాన్లోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ మాల్ ఆఫ్ మస్కట్ లో అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘సెంచరీ సినిమాస్’ ప్రారంభమైంది. మొత్తం 14 స్క్రీన్లు, 1,100 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ మల్టీప్లెక్స్లో ప్రధాన ఆకర్షణగా ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక లేజర్ ప్రొజెక్టర్తో పాటు డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు భారతీయ తెలుగు సహా రీజినల్ భాషల సినిమాలు, అరబిక్ సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఫార్స్ ఫిల్మ్ చైర్మన్ అహ్మద్ గోల్చిన్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ సౌకర్యాలు, విభిన్న భాషల చిత్రాలతో ప్రతి సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







