అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు...
- December 09, 2021న్యూ ఢిల్లీ: కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది.అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఏ పునరాలోచనలో పడింది.కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందే భారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.
ఆ తరువాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతున్నారు.పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ సర్వీసులు నడుస్తున్నాయి.డిసెంబర్ 17 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు నడపాలని అనుకున్నా ఒమిక్రాన్ కేసుల కారణంగా ఆ నిర్ణయాన్ని డీజీసీఏ వెనక్కి తీసుకుంది.జనవరి 31, 2022 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారమే విమాన సర్వీసులు సడుస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?