ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- July 07, 2026
దోహా: ప్రజల్లో అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఖతార్ ప్రభుత్వం చక్కెర కలిపిన పానీయాలపై కొత్త ఎక్సైజ్ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 6నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని జనరల్ ట్యాక్స్ అథారిటీ (GTA) ప్రకటించింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనంగా కలిపిన స్వీటెనర్ల పరిమాణాన్ని బట్టి ఎక్సైజ్ పన్ను నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎక్సైజ్ పన్ను చట్టంలో సవరణలు చేసి పన్ను పరిధిని విస్తరించారు. దీంతో అదనపు చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, జ్యూసులు, అలాగే వాటి తయారీలో ఉపయోగించే కాన్సన్ట్రేట్లు, పొడులు, ఎక్స్ట్రాక్టులు తదితర ఉత్పత్తులు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి.
అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ వస్తువులను నిల్వ ఉంచిన వ్యాపారులు, సంస్థలు తమ వద్ద ఉన్న నిల్వలను ధరీబా (Dhareeba) పోర్టల్ ద్వారా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పన్ను నిర్ణయించడంలో స్టాక్ పరిమాణమే ప్రమాణం కాదని GTA స్పష్టం చేసింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనపు స్వీటెనర్ల స్థాయినే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు జూలై 6నుంచి 90 రోజుల్లోపు ధరీబా పోర్టల్ ద్వారా పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. రిటర్న్ సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పన్ను చెల్లించాలని అథారిటీ సూచించింది.
అలాగే సీల్ చేసిన ప్యాకేజింగ్లో విక్రయించే పానీయాలకు మాత్రమే ఈ ఎక్సైజ్ పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లు, కేఫేలు వంటి చోట్ల వెంటనే వినియోగం కోసం తయారు చేసి, ప్యాకేజింగ్ లేకుండా అందించే పానీయాలకు ఈ పన్ను వర్తించదని జనరల్ ట్యాక్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







