GCC విదేశాంగ మంత్రుల భేటీ.. సమ్మిట్ ఎజెండా ఖరారు

- December 13, 2021 , by Maagulf
GCC విదేశాంగ మంత్రుల భేటీ..  సమ్మిట్ ఎజెండా ఖరారు

సౌదీ: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నేతృత్వంలోని ఆరు జీసీసీ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు.డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న జీసీసీ వార్షిక సమ్మిట్ ఎజెండాను వారు ఖరారు చేశారు. సమిష్టి భద్రత, ప్రాంతీయ వివాదాలు, గల్ఫ్ ప్రాంత అభివృద్ధిని అజెండాలో ప్రధాన అంశాలుగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ, GCC సెక్రటరీ జనరల్ డాక్టర్ నయీఫ్ అల్-హజ్రఫ్ కూడా పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో GCC 42వ సమ్మిట్ కింగ్ సల్మాన్ అధ్యక్షతన డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. గల్ఫ్ దేశాల మధ్య సమన్వయం, ఏకీకరణ, ఆర్థిక, పరస్పర పురోగతిని చర్చించడానికి ఏటా ఈ జీసీసీ వార్షిక శిఖరాగ్ర సమ్మిట్ ను నిర్వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com