ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
- December 18, 2021
హైదరాబాద్: దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్లో ప్రారంభం అయింది. నానక్రాంగూడ ఫొనిక్స్ వీకే టవర్లో 25వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







