ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

- December 18, 2021 , by Maagulf
ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

హైదరాబాద్: దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు కేసీఆర్‌ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com