ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త...
- December 19, 2021
ముంబై: భారత్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.
మరోవైపు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.బేస్ రేట్ను 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021 డిసెంబర్ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇస్తామని ఎస్బీఐ తెలిపింది. అయితే ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్లకు పైగా చేసే డిపాజిట్లపైనే వర్తిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









