ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిఎ ఇబ్రహీం హాజి మృతి
- December 21, 2021
దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నడాక్టర్ పిఎ ఇబ్రహీం మాజి తుది శ్వాస విడిచారు. యూఏఈలో 55 ఏళ్ళపాటు వున్నారాయన. అనారోగ్య కారణాలతో కోజికోడ్లోని మిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.డిసెంబర్ 20న ఆయన్ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకి తరలించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించడం జరిగింది. కేరళలో జన్మించిన డాక్టర్ హాజి, మలబార్ గ్రూప్ కో-ఛైర్మన్ అలాగే పేస్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్గా పని చేశారు. ఇండస్ మోటార్ కంపెనీ వైస్ ఛైర్మన్ అలాగే వ్యవస్థాపకుడాయన. మలబార్ గోల్డ్ సంస్థ కో-ఛైర్మన్ మరియు ముఖ్యమైన పెట్టుబడిదారుగా వున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







