అభిమాని పిలిచె
- March 25, 2016
అప్పుడప్పుడు అర్జున విషాద యోగం లాంటిది నన్ను ఆవహిస్తూ ఉంటుంది.ఎందుకు రాయడం పేరు రాదు డబ్బు రాదు. నువ్వు రాసినది యెవరూ చదవరు గుర్తింపు ఉండదు .సంకలనాల్లో నీ పేరు రాదు.నువ్వు రాసినది సైన్స్ ఫిక్షనే కాదు .అని విమర్శకులు ,,, కొంచెం మామూలు కధలు రాయండి అన్ని సున్నితంగా కొందరు ...ఇక రాయ కూడదు అనుకుంటాను.కాని సీక్వెల్స్ పూర్తి చేయాలి వాటికి ఒక లాజికల్ ముగింపు ఉండాలి.కదా..డార్క్ ఒఉట్పొస్ట్స్ అనే నవల ఇంగ్లీష్ లో ముగించాను.ఇది కుజుడి కోసం నీలి ఆకుపచ్చ తరువాత భాగం దీన్ని మళ్ళీ తెలుగులో రాయాలి.(ఎందుకు?ఎందుకు ....ఎందుకు..?}ఎవరో అరుస్తున్నారు..వేస్ట్ ...
మధ్యాన్నం 1 30 కి హాస్పిటల్ లో ఫోన్ .కొంచెం చదువు రాని అమాయకుడి గొంతులా..."సారూ మీ కుజుదికోసం నవల చదివిన సారూ ..నాకు నీలి ఆకుపచ్చ కావాలి.పైసలు నా దగ్గర లేవు సారూ పంపుతారా?"
కోపం సంతోషం రెండు.నేనెందుకు...పంపాలి..,"లైబ్రరీ లో తెచ్చుకున్నా సారూ ఎంతో ఇష్టం సారూ 8 సార్లు చదివినా.'
నీకేం కావాలి ?అన్నాను కోపం గా ."నీలి ఆకుపచ్చభూ మి కి తిరిగి... రాక" మాటలు పట్టి పట్టి అన్నాడు.
షాక్ అయ్యాను.ఇతను నిజం గా చదివాడు.కొత్త పుస్తకం లో భూమికి పునరాగమనం అని అనువాదం చేసాము.పాత పుస్తకం లో అలావుంది.
అయినా నా బుద్ది పోలేదు ఎందుకు పంపాలి? రోజు ఫోన్ వస్తూనె ఉంది .అతను బీద వాడు ఆర్ఫన్ అట ! కరీంనగర్ నుంచి. లైబ్రరీ లో పుస్తకాలు చదువుతాడు. "నాకు అలిఎన్స్, గ్రహాలూ, స్పేస్ ఇష్టం సార్ ఐ సి సి యు ది ఎపెడెమిక్ అంటూ నా పుస్తకాలు అన్ని పేర్లు చెప్ప్పుతున్నాడు ."165 పేజి లో డిమిట్రీ తండ్రి మీరోస్ అని రాసారు సార్ ఆమె తండ్రి పొసయిడన్ కదా?
అదిరిపోయాను .కరెక్టే .ఇతను క్షుణ్ణం గా చదివాడు.
నా పుస్తకం చేరవలసిన చోటకి చేరింది.ఒక సారి ప్రఖ్యాత రచయిత నాకు ఇష్టం అయిన నామిని గారు చెప్పారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉన్నప్పుడు "నువ్వు రాసేది 10 వ తరగతి వాడికి కూడా అర్థం కావాల! "
ఎంతో మందికి ఉచితం గా ఇచ్చి రెస్పాన్స్ రాని ...అటక మీద నీలి ఆకుపచ్చ కాపీలు పరిహాసం గా నవ్వాయి .మూడు రోజుల క్రితమే అతనికి కొరియర్ చేసాను సంతోషం గా .
కదీర్ బాబు కొత్త పుస్తకం లో కథలు ఎలా రాయాలో మనసు కి హత్తుకునేట్లు రాసారు.ఒక అధ్యాయం ఉంది.ఎందుకు రాయాలి .విమర్శకులు తిట్టినా అన్యాయమైన విమర్శలు చేసినా బాధ పెట్టినా ....ఆయన కి ఒచ్చిన ఫోన్ కాల్ గురించి రాస్తారు. "ఎంత బాగా రాసావ్ బాబు పది కాలాలు బాటు చల్లగా ఉండు" ,
"అందుకు "..ఆ ఒక్క మాటకి కన్నీళ్ళు తిరిగి నాయి చాలాసేపే నిన్న...పదే పదే చదివాను...ఒక రచయిత కి జీవనాధారం పాఠకుడిప్రేమ.లేక పోతే నాపుస్తకం పదిసార్లు చదివి ఫోన్ చేయడం కలలో కూడా ఊహించనిది.!. అందుకే రాస్తూ ఉంటాను.ఉంటాము. కదీర్ రాసిన పుస్తకం అంతటి లో నన్ను కదిలించినది ఆ ఒక్క మాట
అందుకు .
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







