ఏపీ కరోనా అప్డేట్

- December 26, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

ఏపీ: ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,492 కి చేరింది. వీరిలో 20,60,836 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,490కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,11,81, 664 శాంపిల్స్ పరీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com