కోవిడ్ 19: కొత్తగా నిబంధనల్ని ప్రకటించిన అబుధాబి
- December 27, 2021
అబుధాబి: కోవిడ్ 19 కొత్త నిబంధనల్ని అబుధాబి ప్రకటించింది. ఇండోర్ మరియు ఔట్డోర్ కార్యక్రమాలకు సంబంధించిన స్పష్టమైన నిబంధనల్ని కొత్తగా పేర్కొన్నారు. రోజువారీ పెరుగుతున్న కోవిడ్ 19 కేసుల నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెళ్ళిళ్ళు అంతర్యక్రియలు, కుటుంబ పరమైన కార్యక్రమాలకు అత్యధికంగా 60 శాతం సామర్థ్యంతోనే అనుమతిస్తారు. ఇండోర్ ఈవెంట్ల కోసం 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఔట్ డోర్ ఈవెంట్లకు 150 మంది కంటే ఎక్కువమంది హాజరు కాకూడదు. ఇంటివద్ద నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు 30 మందికంటే ఎక్కువ హాజరవకూడదు. అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్, నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది), ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి సామాజిక కార్యక్రమాల్లో పాటించాలి. ఎప్పటికప్పుడు తనిఖీల్ని అధికారులు చేపడతారు, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







