పెరుగుతున్న కోవిడ్ కేసులు..అబుధాబి కొత్త ఆంక్షలు
- December 28, 2021
యూఏఈ: కోవిడ్ నుండి కాస్త ఉపశమనం లభించి ప్రజలు సామాన్య జీవితానికి మెల్లి మెల్లిగా వస్తున్న తరుణంలో కొవిడ్-19 మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తోంది. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. సభలు, సమావేశాలు, వేడుకలు జరుపుకునే వారిని ఉద్దేశిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆ రూల్స్ అమలులోకి వచ్చినట్టు తెలిపింది.
ఇళ్లలో చేసుకునే వేడుకులను కేవలం 30 మందితో మాత్రమే జరుపుకోవాలని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునే వేడుకలు, సమావేశాలకు గరిష్టంగా 150 మందికి మించి హాజరుకావొద్దని తెలిపింది. అలాగే ఇండోర్ ఈవెంట్లలో 50 మంది పాల్గొనొచ్చని పేర్కొంది. కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 26 నుంచే అమలులోకి వస్తాయని ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలందరూ కొవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







