కోవిడ్ 19: హమాద్ మెడికల్ కార్పొరేషన్ కఠిన నిబంధనలు
- December 28, 2021
ఖతార్: హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకోసం అన్ని ఆసుపత్రుల్లోని వివిధ సౌకర్యాల వద్ద ఖచ్చితమైన నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ 19 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ సందర్శకుల్ని అనుమతించరు. కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్, ఫీల్డ్ హాస్పిటల్ - హజమ్ మెబైరీక్, జనరల్ హాస్పిటల్ అలాగే క్యుబాన్ హాస్పిటల్లో ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి. నాన్ కోవిడ్ ఫెసిలిటీస్ వద్ద కూడా ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పబ్లిక్ సందర్శించే అవకాశం వుంటుంది. సందర్శకులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. ఒక్కో విజిటర్ అత్యధికంగా 15 నిమిషాలు మాత్రమే వుండడానికి వీలుంది. ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అత్యధికంగా విజిటింగ్ అవర్స్ సమయంలో అనుమతినిస్తారు. ఎస్కార్ట్ సౌకర్యం వుండదు. ఆహారం, పువ్వులు, డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివాటిని అనుమతించరు. 15 ఏళ్ళ లోపువారికి కూడా అనుమతి లేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







