క్రూజ్ ట్రిప్స్ ద్వారా వచ్చే వారికి ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసా

- January 02, 2022 , by Maagulf
క్రూజ్ ట్రిప్స్ ద్వారా వచ్చే వారికి ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసా

రియాద్: క్రూజ్ షిప్‌ల ద్వారా దేశంలోకి వచ్చే విజిటర్స్ కోసం ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసాను సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ప్రారంభించింది. వీసా పొందాలనుకునే లబ్ధిదారులు MOFA ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.క్రూజ్ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత వీసా దరఖాస్తును పూరించాలని సూచించింది. రెడ్ సీ డెవలప్‌మెంట్ కంపెనీ సహకారంతో ఈ సర్వీసును తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వీసా ప్రక్రియలు ప్రాసెస్ చేయబడతాయని, సౌదీ ఎంబసీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీసా జారీ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com