ఒకే ఏడాది 18వేల మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 02, 2022
కువైట్ సిటీ: కువైట్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 18వేలకు పైగా మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2021లో మొత్తం 18,221 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. వీరందరూ వలసదారుల విషయమై చేసిన వివిధ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇక దేశ బహిష్కరణకు గురైన 18,221 మంది ప్రవాసుల్లో 11,177 మంది పురుషులు, 7,044 మంది మహిళలు ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







