వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

- January 02, 2022 , by Maagulf
వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌజ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడారు. బహ్రెయిన్ ఎల్లో లెవెల్ కోవిడ్-19 ప్రోటోకాల్ ను జారీ చేసినందున ఆ మేరకు భద్రతా చర్యలను అనుసరించాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు.
డానా మాల్ లోని IVS సెంటర్, EolBhCONNECT యాప్ పనితీరును సమీక్షించారు. ఇటీవల బహ్రెయిన్ పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులోకి వచ్చిన రెసిడెంట్ పర్మిట్ స్టిక్కర్ల గురించి కూడా శ్రీవాస్తవ కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మద్దతు ఇచ్చినందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు, భారతీయ సంఘాలు, ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, బుదయ్య గురుద్వారాలకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలకు పైగా బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారులు ఈ వారం ఇండియా కు వెళ్లారని, అలాగే మణి కొంబన్, శశిధరన్ పుల్లోట్, అర్ష్ ప్రీత్ కౌర్లపై విధించిన ట్రావెల్ నిషేధం ఎత్తేయడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని రాయబారి సమావేశంలో వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com