వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 02, 2022
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌజ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడారు. బహ్రెయిన్ ఎల్లో లెవెల్ కోవిడ్-19 ప్రోటోకాల్ ను జారీ చేసినందున ఆ మేరకు భద్రతా చర్యలను అనుసరించాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు.
డానా మాల్ లోని IVS సెంటర్, EolBhCONNECT యాప్ పనితీరును సమీక్షించారు. ఇటీవల బహ్రెయిన్ పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులోకి వచ్చిన రెసిడెంట్ పర్మిట్ స్టిక్కర్ల గురించి కూడా శ్రీవాస్తవ కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మద్దతు ఇచ్చినందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు, భారతీయ సంఘాలు, ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, బుదయ్య గురుద్వారాలకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలకు పైగా బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారులు ఈ వారం ఇండియా కు వెళ్లారని, అలాగే మణి కొంబన్, శశిధరన్ పుల్లోట్, అర్ష్ ప్రీత్ కౌర్లపై విధించిన ట్రావెల్ నిషేధం ఎత్తేయడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని రాయబారి సమావేశంలో వివరించారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







