వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 02, 2022
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌజ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడారు. బహ్రెయిన్ ఎల్లో లెవెల్ కోవిడ్-19 ప్రోటోకాల్ ను జారీ చేసినందున ఆ మేరకు భద్రతా చర్యలను అనుసరించాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు.
డానా మాల్ లోని IVS సెంటర్, EolBhCONNECT యాప్ పనితీరును సమీక్షించారు. ఇటీవల బహ్రెయిన్ పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులోకి వచ్చిన రెసిడెంట్ పర్మిట్ స్టిక్కర్ల గురించి కూడా శ్రీవాస్తవ కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మద్దతు ఇచ్చినందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు, భారతీయ సంఘాలు, ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, బుదయ్య గురుద్వారాలకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలకు పైగా బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారులు ఈ వారం ఇండియా కు వెళ్లారని, అలాగే మణి కొంబన్, శశిధరన్ పుల్లోట్, అర్ష్ ప్రీత్ కౌర్లపై విధించిన ట్రావెల్ నిషేధం ఎత్తేయడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని రాయబారి సమావేశంలో వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







