సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్
- January 07, 2022
యూఏఈ: డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందని, వాటి బారిన పడొద్దని షార్జా పోలీసులు గురువారం ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యే వార్తల విశ్వసనీయత, ఖచ్చితత్వాన్ని చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు. డిపార్ట్మెంట్లోని ఖాళీల గురించి ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్ అధికారిక ప్లాట్ఫారమ్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చట్టంలోని ఆర్టికల్ 52 ప్రకారం.. అధికారిక వర్గాలు ప్రచురించిన వార్తలకు విరుద్ధంగా తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగించే వారిపై కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100,000 దిర్హామ్ల జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు వార్తలు లేదా పుకార్ల ప్రచురణ రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సంక్షోభాలు సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 200,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









