కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే SR1000 ఫైన్
- January 07, 2022
సౌదీ: సోషల్ డిస్టెన్స్, టెంపరేచర్ చెకింగ్ వంటి కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. గత 24 గంటల్లో 3000కి పైగా కేసులు నమోదైన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఉల్లంఘనపై SR1,000 జరిమానా విధించబడుతుందని, ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానాలు రెట్టింపు చేయబడతాయన్నారు. SR100,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెల్త్ మినిస్ట్రీ కరోనావైరస్ సోకిన వ్యక్తుల రికవరీ వ్యవధిని సడలించింది. వ్యాక్సిన్ వేసిన వ్యక్తులకు రికవరీ వ్యవధిని ఏడు రోజులకు, వ్యాక్సిన్ వేయని వ్యక్తులకు 10 రోజులకు తగ్గించింది. రికవరీ పీరియడ్ పూర్తయిన తర్వాత వారి ఆరోగ్య స్థితి తవక్కల్నా అప్లికేషన్లో అప్డేట్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







