కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే SR1000 ఫైన్
- January 07, 2022
సౌదీ: సోషల్ డిస్టెన్స్, టెంపరేచర్ చెకింగ్ వంటి కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. గత 24 గంటల్లో 3000కి పైగా కేసులు నమోదైన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఉల్లంఘనపై SR1,000 జరిమానా విధించబడుతుందని, ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానాలు రెట్టింపు చేయబడతాయన్నారు. SR100,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెల్త్ మినిస్ట్రీ కరోనావైరస్ సోకిన వ్యక్తుల రికవరీ వ్యవధిని సడలించింది. వ్యాక్సిన్ వేసిన వ్యక్తులకు రికవరీ వ్యవధిని ఏడు రోజులకు, వ్యాక్సిన్ వేయని వ్యక్తులకు 10 రోజులకు తగ్గించింది. రికవరీ పీరియడ్ పూర్తయిన తర్వాత వారి ఆరోగ్య స్థితి తవక్కల్నా అప్లికేషన్లో అప్డేట్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







