కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే SR1000 ఫైన్
- January 07, 2022
సౌదీ: సోషల్ డిస్టెన్స్, టెంపరేచర్ చెకింగ్ వంటి కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. గత 24 గంటల్లో 3000కి పైగా కేసులు నమోదైన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఉల్లంఘనపై SR1,000 జరిమానా విధించబడుతుందని, ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానాలు రెట్టింపు చేయబడతాయన్నారు. SR100,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెల్త్ మినిస్ట్రీ కరోనావైరస్ సోకిన వ్యక్తుల రికవరీ వ్యవధిని సడలించింది. వ్యాక్సిన్ వేసిన వ్యక్తులకు రికవరీ వ్యవధిని ఏడు రోజులకు, వ్యాక్సిన్ వేయని వ్యక్తులకు 10 రోజులకు తగ్గించింది. రికవరీ పీరియడ్ పూర్తయిన తర్వాత వారి ఆరోగ్య స్థితి తవక్కల్నా అప్లికేషన్లో అప్డేట్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









