సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్
- January 07, 2022
యూఏఈ: డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందని, వాటి బారిన పడొద్దని షార్జా పోలీసులు గురువారం ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యే వార్తల విశ్వసనీయత, ఖచ్చితత్వాన్ని చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు. డిపార్ట్మెంట్లోని ఖాళీల గురించి ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్ అధికారిక ప్లాట్ఫారమ్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చట్టంలోని ఆర్టికల్ 52 ప్రకారం.. అధికారిక వర్గాలు ప్రచురించిన వార్తలకు విరుద్ధంగా తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగించే వారిపై కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100,000 దిర్హామ్ల జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు వార్తలు లేదా పుకార్ల ప్రచురణ రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సంక్షోభాలు సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 200,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







