సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్
- January 07, 2022
యూఏఈ: డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందని, వాటి బారిన పడొద్దని షార్జా పోలీసులు గురువారం ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యే వార్తల విశ్వసనీయత, ఖచ్చితత్వాన్ని చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు. డిపార్ట్మెంట్లోని ఖాళీల గురించి ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్ అధికారిక ప్లాట్ఫారమ్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చట్టంలోని ఆర్టికల్ 52 ప్రకారం.. అధికారిక వర్గాలు ప్రచురించిన వార్తలకు విరుద్ధంగా తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగించే వారిపై కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100,000 దిర్హామ్ల జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు వార్తలు లేదా పుకార్ల ప్రచురణ రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సంక్షోభాలు సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 200,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







