ఈ శుక్రవారం యూఏఈ చరిత్రలో నిలిచిపోనుంది..
- January 07, 2022
యూఏఈ: యూఏఈ ఇటీవల కొత్త వీకెండ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్న యూఏఈ దేశం.. వారంలో కేవలం నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయించింది.ఇంతకు ముందు శుక్ర, శనివారాల్లో వీకెండ్గా ఉంటే.. ఇప్పుడు రెండున్నర రోజుల(శని, ఆదివారాలతో పాటు శుక్రవారం హాఫ్ డే) వారాంతపు సెలవుగా ప్రకటించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు వారాంతపు సెలవుగా ఉన్న శుక్రవారం.. కొత్త వీకెండ్ కారణంగా తొలిసారి పని దినంగా మారింది. దీంతో యూఏఈలో ఈ శుక్రవారం(నేడు) తొలి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఇదిలా ఉంటే.. పని ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి శుక్రవారం రోజున వర్క్ ఫ్రమ్హోంతో పాటు పని వేళల్లో కూడా వెసులుబాటు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొత్త టైమ్టేబుల్ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి