ఈ శుక్రవారం యూఏఈ చరిత్రలో నిలిచిపోనుంది..
- January 07, 2022
యూఏఈ: యూఏఈ ఇటీవల కొత్త వీకెండ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్న యూఏఈ దేశం.. వారంలో కేవలం నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయించింది.ఇంతకు ముందు శుక్ర, శనివారాల్లో వీకెండ్గా ఉంటే.. ఇప్పుడు రెండున్నర రోజుల(శని, ఆదివారాలతో పాటు శుక్రవారం హాఫ్ డే) వారాంతపు సెలవుగా ప్రకటించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు వారాంతపు సెలవుగా ఉన్న శుక్రవారం.. కొత్త వీకెండ్ కారణంగా తొలిసారి పని దినంగా మారింది. దీంతో యూఏఈలో ఈ శుక్రవారం(నేడు) తొలి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఇదిలా ఉంటే.. పని ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి శుక్రవారం రోజున వర్క్ ఫ్రమ్హోంతో పాటు పని వేళల్లో కూడా వెసులుబాటు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొత్త టైమ్టేబుల్ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









