ఈ శుక్రవారం యూఏఈ చరిత్రలో నిలిచిపోనుంది..
- January 07, 2022యూఏఈ: యూఏఈ ఇటీవల కొత్త వీకెండ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్న యూఏఈ దేశం.. వారంలో కేవలం నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయించింది.ఇంతకు ముందు శుక్ర, శనివారాల్లో వీకెండ్గా ఉంటే.. ఇప్పుడు రెండున్నర రోజుల(శని, ఆదివారాలతో పాటు శుక్రవారం హాఫ్ డే) వారాంతపు సెలవుగా ప్రకటించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు వారాంతపు సెలవుగా ఉన్న శుక్రవారం.. కొత్త వీకెండ్ కారణంగా తొలిసారి పని దినంగా మారింది. దీంతో యూఏఈలో ఈ శుక్రవారం(నేడు) తొలి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఇదిలా ఉంటే.. పని ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి శుక్రవారం రోజున వర్క్ ఫ్రమ్హోంతో పాటు పని వేళల్లో కూడా వెసులుబాటు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొత్త టైమ్టేబుల్ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల