ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!

- January 07, 2022 , by Maagulf
ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!

కువైట్: మినిస్టీరియల్ కమిటీ - కరోనా ఎమర్జెన్సీస్ పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచడం జరిగింది. తదుపరి సమావేశంలో ఈ సూచనలపై చర్చించనుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఐసీయూల్లో అలాగే కరోనా వార్డుల్లో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగితే, విదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా బ్యాన్ విధించేలా ఓ సూచన ఇందులో చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూల్లో 11 కేసులు మాత్రమే వుండగా, కోవిడ్ వార్డుల్లో 53 కేసులు వున్నాయి. కాగా, గడచిన 72 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6,141గా నమోదయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com