'ఒంటెల బ్యూటీ కాంటెస్ట్'లో తొలిసారి పాల్గొన్న మహిళలు
- January 08, 2022
రియాద్: సౌదీ అరేబియాలో జరుగుతున్న 'ఒంటెల బ్యూటీ కాంటెస్ట్'లో మొదటిసారిగా ఇరవై ఐదు మంది ఒంటెలు మహిళా ఓనర్లు పాల్గొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఆరవ ఎడిషన్ లో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించారు. ప్రదర్శనల్లో భాగంగా ఒంటెలను న్యాయమూర్తుల కమిటీ వాటి రంగు, జాతి అధారంగా గ్రేడ్ చేస్తుంది. ఈ సంధర్భంగా సౌదీ ఒంటెల మహిళ ఓనర్ మునిరా అల్-ముఖాస్ మాట్లాడుతూ.. ఈపోటీల్లో అవకాశం రావడం పతకాన్ని గెలుచుకున్నంత ఆనందంగా ఉందన్నారు. చాలా ఎండ్లుగా ఒంటెలు కాంటెస్ట్ లో పాల్గొనాలని చూశాను. ఇప్పుడు నా కోరిక తీరిందని చెప్పింది. ఫెస్టివల్లో తన ఒంటె విలువ దాదాపు SR1 మిలియన్ ($266,000) ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే ఈవెంట్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సౌదీ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఒంటెల కన్సల్టెంట్, సభ్యుడు ఫహద్ అల్-బోగామి మాట్లాడుతూ.. అనేక షేడ్స్ ఒంటెలు పోటీల్లో పాల్గొన్నాయని, వాటి తల, మెడ, మూపురం వంటి వాటితో పాటు పరిమాణం, పొడవు, ఎత్తును పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ చేస్తామన్నారు. రియాద్కు ఈశాన్యంలో నిర్వహించే కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల ఫెస్టివల్ కు ప్రతిరోజూ 100,000 మంది సందర్శకులు వివిధ దేశాల నుంచి వస్తారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









