ఏపీ మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ
- January 08, 2022అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు. ఈ నెల 10 వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి రావాలని... మంత్రి నుంచి ఆహ్వానం అందినట్లు వర్మ ట్విట్టర్లో వెల్లడించారు. సినీరంగ సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి పేర్నినాని కూడా సమాధానమివ్వడం.. ఆ తర్వాత మళ్లీ వర్మ కౌంటర్ ఇవ్వడంతో... వ్యవహారం రసవత్తరంగా మారింది. చివరికి మంత్రి పేర్ని నాని రామూను చర్చలకు పిలవడంతో... ఈ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది. ఇక ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగానే... మంత్రి వర్మను సమావేశానికి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం