తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్..
- January 09, 2022న్యూ ఢిల్లీ: మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్డౌన్లు..ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు..ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది.ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఇవాళ ఒకేరోజుకు లాక్డౌన్ పరిమితం ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ ను అమలు చేయనున్నారు.ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు.
మరోవైపు ఇవాళ సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో.. శనివారం అన్ని మార్కెట్లలో రద్దీ కనిపించింది.మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు..చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి.ఇక తమిళనాడులో సగటున రోజుకు 3 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో.. నైట్ కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం..గురువారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఇక, చెన్నైలో కరోనా కట్టడి చర్యల కోసం 15 మంది ఐఏఎస్లతోప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు సీఎం స్టాలిన్.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు