యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- May 11, 2024
యూఏఈ: ఉమ్రా కోసం ఇ-వీసాలు మరియు సరసమైన ప్యాకేజీలు యాత్రికులకు అందుబాటులో ఉన్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ తీర్థయాత్రకు (జూన్ 14-19) సిద్ధమవుతున్నందున, ఇప్పుడు యూఏఈ నివాసితులు ఉమ్రా చేయడానికి నుసుక్ యాప్లో స్లాట్ను బుక్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే, చెల్లుబాటు అయ్యే ఉమ్రా వీసాలు ఉన్న వ్యక్తులు మాత్రమే తీర్థయాత్రను చేపట్టే అవకాశం ఉన్నది. సౌదీ అరేబియా ఉమ్రా వీసాదారుల ప్రవేశ తేదీని మే 23గా, ఎగ్జిట్ తేదీని జూన్ 6 గా ప్రకటించడంతో, యాత్రికులు తీర్థయాత్రను ప్రారంభించే అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ASAA టూరిజం నుండి ఖైజర్ మహమూద్ మాట్లాడుతూ.. హజ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఉమ్రాను ప్రారంభించాలని కోరుకునే నివాసితుల నుండి తమ ఏజెన్సీకి ప్రతిరోజూ వందకు పైగా కాల్స్ వస్తాయని చెప్పారు. టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు నుసుక్ యాప్ ద్వారా ఉమ్రా కోసం స్లాట్లను తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని మహమూద్ చెప్పారు. అదే విధంగా వచ్చిన యాత్రికులు హజ్ సీజన్లో లేదా అంతకు ముందు పవిత్ర స్థలాలను వదిలిపెట్టకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠినమైన జరిమానాలు వేచి ఉన్నాయని చెప్పారు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SAR 50,000 వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







