యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- May 11, 2024
యూఏఈ: ఉమ్రా కోసం ఇ-వీసాలు మరియు సరసమైన ప్యాకేజీలు యాత్రికులకు అందుబాటులో ఉన్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ తీర్థయాత్రకు (జూన్ 14-19) సిద్ధమవుతున్నందున, ఇప్పుడు యూఏఈ నివాసితులు ఉమ్రా చేయడానికి నుసుక్ యాప్లో స్లాట్ను బుక్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే, చెల్లుబాటు అయ్యే ఉమ్రా వీసాలు ఉన్న వ్యక్తులు మాత్రమే తీర్థయాత్రను చేపట్టే అవకాశం ఉన్నది. సౌదీ అరేబియా ఉమ్రా వీసాదారుల ప్రవేశ తేదీని మే 23గా, ఎగ్జిట్ తేదీని జూన్ 6 గా ప్రకటించడంతో, యాత్రికులు తీర్థయాత్రను ప్రారంభించే అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ASAA టూరిజం నుండి ఖైజర్ మహమూద్ మాట్లాడుతూ.. హజ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఉమ్రాను ప్రారంభించాలని కోరుకునే నివాసితుల నుండి తమ ఏజెన్సీకి ప్రతిరోజూ వందకు పైగా కాల్స్ వస్తాయని చెప్పారు. టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు నుసుక్ యాప్ ద్వారా ఉమ్రా కోసం స్లాట్లను తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని మహమూద్ చెప్పారు. అదే విధంగా వచ్చిన యాత్రికులు హజ్ సీజన్లో లేదా అంతకు ముందు పవిత్ర స్థలాలను వదిలిపెట్టకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠినమైన జరిమానాలు వేచి ఉన్నాయని చెప్పారు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SAR 50,000 వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









