కువైట్ లో క్వారంటైన్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన
- January 09, 2022
కువైట్ సిటీ: కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకోని వారికి వేర్వేరుగా క్వారంటైన్ పీరియడ్ ఉండాలనేది ఆ దేశ మంత్రిమండలి ఆలోచన. ఈ మేరకు తాజాగా భేటీ అయిన కేబినేట్ ప్రధానంగా క్వారంటైన్ విషయమై కీలక చర్చలు జరిపింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారిన పడితే 7 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుందని ప్రతిపాదించింది. అలాగే కేవలం ఒక్క డోసు టీకా తీసుకున్నవారితో పాటు అసలు వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే 14 రోజుల క్వారంటైన్ ఉంటాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై తర్వాతి కేబినేట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









