కువైట్ లో క్వారంటైన్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన
- January 09, 2022
కువైట్ సిటీ: కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకోని వారికి వేర్వేరుగా క్వారంటైన్ పీరియడ్ ఉండాలనేది ఆ దేశ మంత్రిమండలి ఆలోచన. ఈ మేరకు తాజాగా భేటీ అయిన కేబినేట్ ప్రధానంగా క్వారంటైన్ విషయమై కీలక చర్చలు జరిపింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారిన పడితే 7 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుందని ప్రతిపాదించింది. అలాగే కేవలం ఒక్క డోసు టీకా తీసుకున్నవారితో పాటు అసలు వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే 14 రోజుల క్వారంటైన్ ఉంటాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై తర్వాతి కేబినేట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







