తెలంగాణ కరోనా అప్డేట్
- January 14, 2022హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది.దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి.రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం .. తాజాగా 2,398 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన కరోనా కేసుల సంఖ్య 7,05,199 కు చేరింది.నేడు కరోనా కారణంగ ముగ్గురు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతుంది.ప్రతి రోజు ఒకరు లేదా ఇద్దరూ కరోనా తో మరణించే వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,052 కు చేరింది. కాగా ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు