తెలంగాణ కరోనా అప్డేట్
- January 14, 2022హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది.దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి.రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం .. తాజాగా 2,398 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన కరోనా కేసుల సంఖ్య 7,05,199 కు చేరింది.నేడు కరోనా కారణంగ ముగ్గురు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతుంది.ప్రతి రోజు ఒకరు లేదా ఇద్దరూ కరోనా తో మరణించే వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,052 కు చేరింది. కాగా ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..