ప్రపంచ ఛాంపియన్కు షాక్.. సత్తా చాటిన లక్ష్య సేన్
- January 16, 2022న్యూ ఢిల్లీ: భారత ఓపెన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ సత్తా చాటాడు. 2022, జనవరి 16వ తేదీ ఆదివారం ఇండియా ఓపెన్ – 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూతో లక్ష్య సేన్ తలపడ్డాడు. ఆద్యంత ఉత్కంఠగా ఈ పోటీ జరిగింది. ఇరువురు పాయింట్లు సాధించడానికి హోరాహోరీగా తలపడ్డారు.
మ్యాచ్ ఎవరి వైపు మళ్లుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే లక్ష్య సేన్ మాత్రం గురి తప్పకుండబా షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు…ఈ టైటిల్ ను ప్రకాష్ పదుకొణె (1981), కిదాంబి శ్రీకాంత్ (2015) తొలి సూపర్ 500 ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నారు.
మెరుగైన ఆటతీరును కనబరిచిన లక్ష్య సేన్ ను పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. కేవలం 54 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం విశేషం. మరోవైపు…పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్ టైటిల్ మాత్రం థాయిలాండ్ వశం చేసుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ