ప్రపంచ ఛాంపియన్కు షాక్.. సత్తా చాటిన లక్ష్య సేన్
- January 16, 2022
న్యూ ఢిల్లీ: భారత ఓపెన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ సత్తా చాటాడు. 2022, జనవరి 16వ తేదీ ఆదివారం ఇండియా ఓపెన్ – 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూతో లక్ష్య సేన్ తలపడ్డాడు. ఆద్యంత ఉత్కంఠగా ఈ పోటీ జరిగింది. ఇరువురు పాయింట్లు సాధించడానికి హోరాహోరీగా తలపడ్డారు.
మ్యాచ్ ఎవరి వైపు మళ్లుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే లక్ష్య సేన్ మాత్రం గురి తప్పకుండబా షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు…ఈ టైటిల్ ను ప్రకాష్ పదుకొణె (1981), కిదాంబి శ్రీకాంత్ (2015) తొలి సూపర్ 500 ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నారు.
మెరుగైన ఆటతీరును కనబరిచిన లక్ష్య సేన్ ను పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. కేవలం 54 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం విశేషం. మరోవైపు…పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్ టైటిల్ మాత్రం థాయిలాండ్ వశం చేసుకుంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









