64 సబ్స్టేషన్స్ నిర్మించనున్న 'దెవా'
- March 26, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) 131/11 కిలోవాట్ కెపాసిటీతో 64 సబ్ స్టేషన్స్ని రానున్న మూడేళ్ళలో నిర్మించనుంది. వీటి కోసం 6.7 బిలియన్ దిర్హామ్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్కి ఈ కొత్త స్టేషన్స్ని లింక్ చేయడం ద్వారా ఎఫీషియన్సీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ ఇనీషియేట్ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో 'దెవా' ప్రజల అవసరాల్ని తీర్చడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దెవా ఎండీ మరియు సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మిడిల్ ఈస్ట్లో యూఏఈ నెంబర్ 1 పొజిషన్లో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థానం 4 అని చెప్పారు. లాంగ్ టెర్మ్ వ్యూహంతో సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రజల అవసరాన్ని తీర్చాలనే సంకల్పంతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. 2018 వేసవి నాటికి లక్ష్యాన్ని చేరతామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?