64 సబ్స్టేషన్స్ నిర్మించనున్న 'దెవా'
- March 26, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) 131/11 కిలోవాట్ కెపాసిటీతో 64 సబ్ స్టేషన్స్ని రానున్న మూడేళ్ళలో నిర్మించనుంది. వీటి కోసం 6.7 బిలియన్ దిర్హామ్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్కి ఈ కొత్త స్టేషన్స్ని లింక్ చేయడం ద్వారా ఎఫీషియన్సీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ ఇనీషియేట్ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో 'దెవా' ప్రజల అవసరాల్ని తీర్చడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దెవా ఎండీ మరియు సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మిడిల్ ఈస్ట్లో యూఏఈ నెంబర్ 1 పొజిషన్లో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థానం 4 అని చెప్పారు. లాంగ్ టెర్మ్ వ్యూహంతో సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రజల అవసరాన్ని తీర్చాలనే సంకల్పంతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. 2018 వేసవి నాటికి లక్ష్యాన్ని చేరతామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ