తీవ్రవాద కార్యకలాపాల్ని సహించేది లేదన్న సౌదీ అరేబియా
- January 18, 2022
రియాద్: సౌదీ అరేబియా, తీవ్రవాద ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తామని ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ హౌతీ తీవ్రవాదుల దుశ్చర్యల్ని సహించేది లేదనీ, గట్టి గుణపాఠం చెబుతూనే వుంటామని స్పష్టం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇటీవల జరిగిన హౌతీ దాడిని తీవ్రంగా ఖండించింది సౌదీ అరేబియా. యెమెనీ పార్టీలతో కలిసి శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేసినా హౌతీ మిలీషియా మాత్రం తన పంథా వీడటంలేదని సౌదీ అరేబియా అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్లోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా హౌతీ మిలీషియా తీరు మారుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలిసికట్టుగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వుందన్నారాయన.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







