పాల్మైరా సిరియా స్వాధీనం..
- March 27, 2016
రష్యా దళాల సహాయంతో సిరియా సైన్యం పాల్మైరా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనతో ఐసిస్ మీద సిరియా చెప్పుకోదగ్గ విజయం సాధించినట్లయింది.సిరియాలో ప్రముఖ పురాతన నగరంగా పేరొందిన పాల్మైరాను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. అలాంటి ఈ నగరాన్ని గత ఏడాది మేలో ఐసిస్ స్వాధీనం చేసుకుని పలు వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసింది.ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోడానికి గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధంలో సిరియా తరఫున 188 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలొదిలారు.ఐసిన్ 400 మందిని కోల్పోయింది. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఐసిస్ అమర్చిన బాంబులను, మందుపాతరలను నిర్వీర్యం చేసే పనిలో సిరియా సైన్యం నిమగ్నమైంది. వారసత్వ కట్టడాలున్న ప్రాంతంతో పాటు పౌర నివాస ప్రాంతం కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని సిరియా తెలిపింది.ఐసిస్ ఆధ్వర్యంలో ఉన్న మరో నగరం మోసూల్ని కూడా త్వరలో స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం ప్రారంభించినట్లు ఇరాక్ సైన్యం గత గురువారం ప్రకటించింది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







