నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్: 500 మోటరిస్టులకు జరీమానా
- January 22, 2022
దుబాయ్: దుబాయ్ పోలీస్ 526 మంది మోటరిస్టులకు జరీమానా విధించడం జరిగింది. 210 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. గడచిన రెండు నెలల్లో అల్ రువయ్యా ప్రాంతంలో నమోదైన తీవ్ర ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నిర్లక్ష్య పూరితంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించారు. ఇతరులకు ప్రమాదం కలిగించేల వాహనాన్ని నడిపితే 23 ట్రాఫిక్ పాయింట్లు, 2,000 దిర్హాముల జరీమానాతోపాటు, వాహనాన్ని 60 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్సు లేకుండా వాహనానికి మార్పులు చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 ట్రాఫిక్ పాయింట్లు, 30 రోజులపాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేటుతో వాహనాన్ని నడిపితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







