నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్: 500 మోటరిస్టులకు జరీమానా

- January 22, 2022 , by Maagulf
నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్: 500 మోటరిస్టులకు జరీమానా

దుబాయ్: దుబాయ్ పోలీస్ 526 మంది మోటరిస్టులకు జరీమానా విధించడం జరిగింది. 210 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.  గడచిన రెండు నెలల్లో అల్ రువయ్యా ప్రాంతంలో నమోదైన తీవ్ర ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నిర్లక్ష్య పూరితంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించారు. ఇతరులకు ప్రమాదం కలిగించేల వాహనాన్ని నడిపితే 23 ట్రాఫిక్ పాయింట్లు, 2,000 దిర్హాముల జరీమానాతోపాటు, వాహనాన్ని 60 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్సు లేకుండా వాహనానికి మార్పులు చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 ట్రాఫిక్ పాయింట్లు, 30 రోజులపాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేటుతో వాహనాన్ని నడిపితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com