పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది

- March 28, 2016 , by Maagulf
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8మందికి పద్మభూషణ్‌, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ధీరూభాయి హీరాచంద్‌ అంబానీ, అవినాష్‌ కమలాకర్‌ దీక్షిత్‌, జగ్‌మోహన్‌, యామినీ కృష్ణమూర్తి, శ్రీశ్రీరవిశంకర్‌లు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. షాపూర్‌జీ పల్లోంజీ, సైనా నెహ్వాల్‌, వినోద్‌రాయ్‌, ఆళ్ల వెంకటరామారావు, దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com