'తెలంగాణ ఆవిర్భావ' వేడుకలకు వేదిక కానున్న బహ్రెయిన్

- June 09, 2015 , by Maagulf
'తెలంగాణ ఆవిర్భావ' వేడుకలకు వేదిక కానున్న బహ్రెయిన్

బహ్రెయిన్ లో జూన్ 12వ తేది శుక్రువారం తెలంగాణా సంస్కృతిక సంఘం ఆధ్వర్యం లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు  ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు కువైట్, బహ్రెయిన్, సౌదీ, తెలంగాణ సంస్కృతిక అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ గారు మరియు కార్యవర్గ సభ్యులు సామ చిన్న రాజారెడ్డి, పయ్యావుల శ్రీనివాసు, వెంకటస్వామి, రవి దాసరి, మురళి విట్టాల్  తెలిపారు.ఈవేడుకకు ముఖ్య అతిధి గా విచ్చేస్తున్న శ్రీమతి కవిత గారు M.P. బహ్రెయిన్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఇండియన్ స్కూల్ గ్రౌండ్స్ ఐస టౌన్ బహ్రెయిన్ లో  ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. కావున తెలుగు వారు అందరు పాలుగుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యవలసింది గా కోరుతున్నాం.అలాగే గల్ఫ్ లో కార్మికుల సమస్యలు గురించి కవిత గారికి చెప్పి అందరిని ఆదుకునె ప్రయత్నం చేస్తామని కార్యవర్గ సభ్యులు చెప్పారు.

 

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com