కోవిడ్-19 కోలుకున్న వారికి బూస్టర్ డోస్
- January 31, 2022
ఖతార్: కోవిడ్-19 కోలుకున్న రోగులకు బూస్టర్ డోస్ ఇవ్వడంపై పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) స్పష్టతనిచ్చింది. కరోనా పాటిజివ్ వచ్చిన వ్యక్తులు ఇన్ఫెక్షన్ తేదీ నుండి మూడు నెలలు పూర్తయిన తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక నెల తర్వాత కూడా ఎవరైనా బూస్టర్ డోస్ తీసుకోవాలనుకుంటే అనుమతిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ఖతార్లో 5,777,396 వ్యాక్సినేషన్ డోసులు అందించారు. వాటిలో 780,609 బూస్టర్ డోస్లు ఉన్నాయి. ఖతార్లోని జనాభాలో దాదాపు 86.9% మందికి రెండు డోస్ల వ్యాక్సిన్లు వేసినట్లు పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కోవిడ్-19 బూస్టర్ డోస్లు, అన్ని ఇతర వ్యాక్సినేషన్ డోసులు బు గార్న్ లోని ఖతార్ వ్యాక్సినేషన్ సెంటర్ (QVC), లుసైల్ నగరంలో డ్రైవ్-ఇన్తో పాటు మొత్తం 28 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో (PHCCలు) అందిస్తున్నారు. వ్యాపార సంస్థలు [email protected]కి ఇమెయిల్ చేస్తే వారివద్ద పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ డ్రైవ్ చేపడతామని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







