కోవిడ్-19 కోలుకున్న వారికి బూస్టర్ డోస్
- January 31, 2022
ఖతార్: కోవిడ్-19 కోలుకున్న రోగులకు బూస్టర్ డోస్ ఇవ్వడంపై పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) స్పష్టతనిచ్చింది. కరోనా పాటిజివ్ వచ్చిన వ్యక్తులు ఇన్ఫెక్షన్ తేదీ నుండి మూడు నెలలు పూర్తయిన తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక నెల తర్వాత కూడా ఎవరైనా బూస్టర్ డోస్ తీసుకోవాలనుకుంటే అనుమతిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ఖతార్లో 5,777,396 వ్యాక్సినేషన్ డోసులు అందించారు. వాటిలో 780,609 బూస్టర్ డోస్లు ఉన్నాయి. ఖతార్లోని జనాభాలో దాదాపు 86.9% మందికి రెండు డోస్ల వ్యాక్సిన్లు వేసినట్లు పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కోవిడ్-19 బూస్టర్ డోస్లు, అన్ని ఇతర వ్యాక్సినేషన్ డోసులు బు గార్న్ లోని ఖతార్ వ్యాక్సినేషన్ సెంటర్ (QVC), లుసైల్ నగరంలో డ్రైవ్-ఇన్తో పాటు మొత్తం 28 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో (PHCCలు) అందిస్తున్నారు. వ్యాపార సంస్థలు [email protected]కి ఇమెయిల్ చేస్తే వారివద్ద పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ డ్రైవ్ చేపడతామని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







