భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే 13% తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో 2,46,674 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 4,00,17,088కి చేరుకుంది. అటు కరోనాతో మరో 1,072 మంది మరణించారు.కాగా ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివివిటీ రేటు 9.27%గా ఉంది. నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో 42,677 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 16,436 కేసులు, మహారాష్ట్రలో 15,252 కేసులు, తమిళనాడులో 11,993 కేసులు, రాజస్థాన్లో 8,073 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









