ఏంటా కుంటి సాకులు..కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

- February 05, 2022 , by Maagulf
ఏంటా కుంటి సాకులు..కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది, ఇదేనా మీ సంస్కారం అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.  ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా అని ఆయన మండిపడ్డారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని ఆయన పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com