సీనియర్ తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ మృతి
- March 29, 2016
సీనియర్ తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ మంగళవారం కన్నుమూశారు. మంత్రిగారి వియ్యంకుడు, వివాహ భోజనంబు, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్లంట, కృష్ణార్జునులు తదితర చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 1978లో బాపు దర్శకత్వంలో చిరంజీవితో తెరకెక్కిన 'మన వూరి పాండవులు' చిత్రంతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన చిత్రాలను నిర్మించడంతో పాటు... పలు అనువాద చిత్రాలను కూడా విడుదల చేశారు. మేకప్మెన్గా సినీ జీవితాన్ని ప్రారంభించిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. రెబల్స్టార్ కృష్ణంరాజు, విజయశాంతిలకు ఆయన వ్యక్తిగత మేకప్మేన్గా పనిచేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







