లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సిఎం కెసిఅర్
- March 29, 2016
తెలంగాణలో త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు వెయ్యి గ్రూప్-2 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.ప్రాజెక్టుల రీ డిజైన్ పై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. అవసరమైతే సభను శుక్రవారం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ...పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. ఈ పథకానికి ఏలాంటి ఆటంకాలు రాకుండా దశల వారీగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







