పెద్ద హీరోల పై 'ఆర్.జి.వి' సంచలన వ్యాఖ్యలు
- June 09, 2015
ఛార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతి లక్ష్మీ' సినిమాను జూన్ 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురువైన రామ్ గోపాల్ వర్మకు స్పెషల్ షో చూపించారు పూరి జగన్నాథ్.'జ్యోతి లక్ష్మీ' సినిమాలో హీరోయిన్ చార్మి పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.'జ్యోతి లక్ష్మీ' సినిమా చూసాను. మెసేజ్ అండ్ బ్యూటీ పర్ ఫెక్ట్గా మిక్స్ చేసి తీసారు. దాంతో పాటు ఎంటర్టెన్మెంట్ కూడా అదిరిపోయింది.చార్మి పెర్పార్మెన్స్ సూపర్. జగన్ చార్మిని చాలా బాగా చూపించాడు. పంచ్ లైన్స్, టెక్నికల్ స్టైలైజేషన్ బావుంది. చార్మి లుక్ చాలా హీరోయిక్ గా ఉంది. రియల్ ఎమోషన్స్.ఫేక్ హీరోయిజం అసలే లేదు.చాలా మంది పెద్ద హీరోల కంటే ఆమె బెటర్ అంటూ కామెంట్ చేసారు. ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జ్యోతి లక్ష్మీ'. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఛార్మి హీరోయిన్గా 'జ్యోతి లక్ష్మీ' పేరుతో సినిమా చెయ్యబోతున్నామని దర్శకనిర్మాతలు ఎనౌన్స్ చెయ్యడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారో ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాగా 'జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







