'ఎయిరిండియా' స్పెషల్ ఆఫర్..

- June 09, 2015 , by Maagulf
'ఎయిరిండియా' స్పెషల్ ఆఫర్..

వరుసపెట్టి ప్రైవేటు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుండటంతో.. ఈ రేసులోకి ఎయిరిండియా కూడా ప్రవేశించింది. అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1777కే టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ లోపు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా వెబ్ సైట్ ద్వారా గానీ, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా గానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ ను పెంచుకోడానికి ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలా ఆఫర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com