వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం
- March 29, 2016
ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ కోసం వాట్సప్, స్కైప్, వైబర్ లాంటి యాప్స్ వినియోగదారులకు శుభవార్త. ఈ యాప్ల నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్కు సంబంధించిన ల్యాండ్లైన్ ఫోన్లకు కాల్స్ చేసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటును కలిగించింది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ సేవలతో వాయిస్ కాల్స్ను అనుసంధానం చేయాలని టెలికం పర్యవేక్షణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫారసును కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటీకి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికం ఆపరేటర్లకు మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది.ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంటర్నెట్ సదుపాయం ద్వారా తక్కువ ధరకే (మొబైల్ డాటా వినియోగం ఆధారంగా) వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం వినియోగదారులకు కలుగుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







