వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం
- March 29, 2016
ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ కోసం వాట్సప్, స్కైప్, వైబర్ లాంటి యాప్స్ వినియోగదారులకు శుభవార్త. ఈ యాప్ల నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్కు సంబంధించిన ల్యాండ్లైన్ ఫోన్లకు కాల్స్ చేసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటును కలిగించింది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ సేవలతో వాయిస్ కాల్స్ను అనుసంధానం చేయాలని టెలికం పర్యవేక్షణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫారసును కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటీకి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికం ఆపరేటర్లకు మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది.ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంటర్నెట్ సదుపాయం ద్వారా తక్కువ ధరకే (మొబైల్ డాటా వినియోగం ఆధారంగా) వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం వినియోగదారులకు కలుగుతుంది.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









