సానియా జంటకు చుక్కెదురైంది..

- March 29, 2016 , by Maagulf
సానియా జంటకు చుక్కెదురైంది..

వరుసగా రెండో టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 2-6తో మార్గరీటా గస్‌పర్యాన్ (రష్యా)-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడం గమనార్హం. గత నెల రోజుల్లో సానియా-హింగిస్ జంట వరుసగా మూడు టోర్నీల్లో (ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com