సానియా జంటకు చుక్కెదురైంది..
- March 29, 2016
వరుసగా రెండో టోర్నమెంట్లో ప్రపంచ నంబర్వన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 2-6తో మార్గరీటా గస్పర్యాన్ (రష్యా)-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జంట తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోవడం గమనార్హం. గత నెల రోజుల్లో సానియా-హింగిస్ జంట వరుసగా మూడు టోర్నీల్లో (ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









