శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- February 13, 2022 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 248.4 గ్రాముల బంగార పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జడ్డా నుంచి శంషాబాద్ కు వచ్చిన SV 754 విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది.దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ నెల 8వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది.

దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బంగారాన్ని నల్లటి కార్బన్ పేపర్ లో చుట్టి అక్రమంగా తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com