శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- February 13, 2022హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 248.4 గ్రాముల బంగార పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జడ్డా నుంచి శంషాబాద్ కు వచ్చిన SV 754 విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది.దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ నెల 8వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బంగారాన్ని నల్లటి కార్బన్ పేపర్ లో చుట్టి అక్రమంగా తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు