శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- February 13, 2022హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 248.4 గ్రాముల బంగార పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జడ్డా నుంచి శంషాబాద్ కు వచ్చిన SV 754 విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది.దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ నెల 8వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బంగారాన్ని నల్లటి కార్బన్ పేపర్ లో చుట్టి అక్రమంగా తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..