ఒమన్: 2021 డిసెంబరులో 384 శాతం పెరిగిన సందర్శకులు

- February 14, 2022 , by Maagulf
ఒమన్: 2021 డిసెంబరులో 384 శాతం పెరిగిన సందర్శకులు

మస్కట్:డిసెంబర్ 2021 నాటికి 652,000 మంది సందర్శకులు రాగా, ఇదే సమయానికి 1.9 మిలియన్ ప్రయాణీకులు (ఒమనీయులు మరియు వలసదారులు) ప్రయాణాలు చేశారు.కాగా, సందర్శకుల్లో అత్యధికులు జిసిసి దేశాల నుంచే వచ్చారు. వీరి సంఖ్య 293,125గా వుంది.ఆ తర్వాతి స్థానంలో భారతదేశం (106,042) కాగా, యెమెన్ (41,923), పాకిస్తాన్ (19,326) వున్నాయి. 3-5 స్టార్ హోటళ్ళ ద్వారా వచ్చిన రెవెన్యూ 102 మిలియన్ ఒమన్ రియాల్స్.హోటళ్ళలో అతిథుల సంఖ్య 1.2 మిలియన్లకు చేరుకుంది డిసెంబర్ చివరి నాటికి.కేవలం డిసెంబరులోనే 180,000 సందర్శకులు వచ్చారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే పెరుగుదల 384 శాతం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com