ఏపీ కరోనా అప్డేట్
- February 14, 2022
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా మరొకరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,212. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14వేల 698. రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల 726 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో(749 కేసులు, 3 మరణాలు) పోలిస్తే సోమవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం.
మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో కొత్త కేసులు భారీగా తగ్గాయి. దీంతో దేశ ప్రజలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







