సౌదీలో తెలుగు మహిళ ఆక్రందన

- June 09, 2015 , by Maagulf
సౌదీలో తెలుగు మహిళ ఆక్రందన

సౌదీ అరేబియాలో డబ్బు సంపాదించవచ్చని భావించి గుడ్డిగా వెళ్లిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కరరెడ్డి నగర్‌కు చెందిన ఖాజాబా(50)కు ముగ్గురు సంతానం.పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది.ఆమె కూతురు వద్దే ఉంటోంది.ఈ క్రమంలో మనవడు మహబూబ్‌ (4) గుండెకు చిల్లి పడిందని వైద్యులు చెప్పారు.దీంతో కూలీ చేసే కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయిం చారు అయినప్పటికీ రూ.50 వేల అప్పు అయికూర్చుంది.వడ్డీ పెరిగిపోతుండడంతో,దానిని తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లింది.సౌదీలో ఖాజాబా యజమానురాలు పెట్టే చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని ప్రాధేయపడు తోంది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com